రేవంత్ రెడ్డి గురించి తాను మాట్లాడిన వ్యాఖ్యలను పోచారం శ్రీనివాస్ రెడ్డి సమర్థించుకున్నారు. “రేవంత్ రెడ్డి గురించి ఉన్నదే మాట్లాడా.. తప్పేముంది?” అంటూ ప్రశ్నించారు. తాను ప్రజల కోసమే పార్టీ మారానని, డబ్బుల కోసం కాదని పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదని, తాను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని, ప్రజల కోసమే తన జీవితం అని పేర్కొన్నారు. తనలో స్వార్థం ఉందని నిరూపిస్తే రాజకీయాలు వదులుకుంటానని సవాల్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఏదైనా చేస్తానని తెలిపారు.
Source link
MLA Pocharam Srinivas Reddy : డబ్బుల కోసం పార్టీ మారలేదు! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











