Last Updated:
హైదరాబాద్లో రూ.70,000 కోట్లతో భారీ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు హైపర్వాల్ట్ సిద్ధవుతోంది. వేలాది ఉద్యోగాలు, గ్లోబల్ ఏఐ రంగంలో హైదరాబాద్కు కీలక స్థానం లభించనుంది.
హైదరాబాద్లో భారీ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్వాల్ట్ ఏకంగా రూ.70,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్ట్తో వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండటంతో పాటు, హైదరాబాద్కు గ్లోబల్ ఏఐ రంగంలో మరింత కీలక స్థానం దక్కనుంది. పీటీఐ కథనం ప్రకారం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అనుబంధ సంస్థ హైపర్వాల్ట్ హైదరాబాద్లో 264 ఎకరాల భూమిని దక్కించుకున్నట్లు శనివారం ప్రకటించింది. ఇక్కడ భారీ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్ క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం హైపర్వాల్ట్, దాని భాగస్వాములు కలిసి రూ.70,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నారు.














