Last Updated:
PM Modi: దేశంలోని 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ 6 ప్రాజెక్టుల అంచనా వ్యయం సుమారు 30 వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ఈ ప్రాజెక్టులు దేశ ఆర్థిక వ్యవస్థకు, పారిశ్రామికాభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడతాయని మోదీ తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 25న ‘సేవా తీర్థ్’లో ప్రతిష్టాత్మక 53వ ప్రగతి (PRAGATI – ప్రో-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్) ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఆయన కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా రైల్వే, రహదారులు, విద్యుత్ రంగాలకు చెందిన 6 కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మోదీ సుదీర్ఘంగా సమీక్షించారు. దేశంలోని 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ 6 ప్రాజెక్టుల అంచనా వ్యయం సుమారు 30 వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ఈ ప్రాజెక్టులు దేశ ఆర్థిక వ్యవస్థకు, పారిశ్రామికాభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడతాయని మోదీ వివరించారు.














