Last Updated:
అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్ దాడికి యత్నించడంతో అమెరికా సైన్యం ప్రతీకార చర్యలకు దిగింది. ఇరాన్కు చెందిన మూడు ముడి చమురు ట్యాంకర్లను దాడుల్లో పూర్తిగా నిర్వీర్యం చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) అధికారికంగా ప్రకటించింది.
పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. తమ నౌకాదళ యుద్ధనౌకలపై దాడులకు తెగబడిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) చర్యలకు అమెరికా సైన్యం దీటుగా బదులిచ్చింది. శనివారం చేపట్టిన మెరుపు దాడిలో ఇరాన్కు చెందిన మూడు ముడి చమురు ట్యాంకర్లను పూర్తిగా నిర్వీర్యం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) అధికారికంగా ప్రకటించింది. అంతకుముందు ఇరాన్ దళాలు ప్రయోగించిన దాడుల నుంచి అమెరికా నౌకలు సురక్షితంగా తప్పించుకున్నాయని స్పష్టం చేసింది.














