ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించి, ఉత్తరాది రాష్ట్రాలకు గొప్ప కానుకను అందించారు. 210 కిలోమీటర్ల పొడవైన ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే అందుబాటులోకి రావడంతో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్కు ప్రయాణ సమయం 6 గంటల నుండి కేవలం 2.5 గంటలకు తగ్గిపోనుంది. ఈ ప్రాజెక్టులో అత్యంత ప్రత్యేకత ఆసియాలోనే పొడవైన 12 కిలోమీటర్ల ఎలివేటెడ్ వన్యప్రాణి కారిడార్. ఇది రాజాజీ టైగర్ నేషనల్ పార్క్ వన్యప్రాణులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్మించబడింది. ప్రారంభోత్సవం అనంతరం సహారన్పూర్లో మోడీ నిర్వహించిన రోడ్షోకు జనం ప్రభంజనంలా తరలివచ్చారు. ఈ రహదారి ఉత్తరాఖండ్లోని చార్ ధామ్ యాత్రకు మరియు పర్యాటక రంగ అభివృద్ధికి కీలక మారనుంది.
Source link
PM Modi | ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వే ప్రారంభం.. | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










