Last Updated:
గత రెండు మ్యాచ్ల్లో ఓటములతో డీలా పడ్డ ఢిల్లీకి ఈ మ్యాచ్లో లభించిన విజయం పెద్ద ఊరట అనే చెప్పాలి. 226 పరుగుల లక్ష్యాన్ని 19.1 బంతుల్లో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఢిల్లీ ఛేదించింది.
RR vs DC: మరో హై స్కోరింగ్ మ్యాచ్లో ఛేజింగ్ టీమే విజయం సాధించింది. జైపూర్ వేదికగా శుక్రవారం జరిగిన పోరులో రాజస్తాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. గత రెండు మ్యాచ్ల్లో ఓటములతో డీలా పడ్డ ఢిల్లీకి ఈ మ్యాచ్లో లభించిన విజయం పెద్ద ఊరట అనే చెప్పాలి. 226 పరుగుల లక్ష్యాన్ని 19.1 బంతుల్లో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఢిల్లీ ఛేదించింది. కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) మరోసారి రెచ్చిపోయాడు. పాతుమ్ నిస్సాంక (33 బంతుల్లో 62; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. వీరిద్దరు తొలి వికెట్కు 110 పరుగులు జోడించారు. నితీశ్ రాణా (33).. చివర్లో అశుతోశ్ శర్మ (25 నాటౌట్) రాణించడంతో ఢిల్లీ విజయం ఖాయమైంది. ఈ విజయంతో ఢిల్లీ ఖాతాలో 8 పాయింట్లు చేరాయి. ప్రస్తుతం 6వ స్థానంలో కొనసాగుతుంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. తద్వారా ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇన్నింగ్స్ ఆరంభంలో రాజస్థాన్కు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (6), యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (4) తక్కువ పరుగులకే వెనుదిరగడంతో స్టేడియంలో నిశ్శబ్దం ఆవరించింది. ఆ దశలో రాజస్థాన్ కనీసం 200 పరుగులైనా చేయగలుగుతుందా అనే సందేహం నెలకొంది. అయితే, క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రియాన్ పరాగ్ తనలోని అసలైన హిట్టర్ను బయటకు తీశాడు. ఈ సీజన్లో తన తొలి అర్ధ సెంచరీని నమోదు చేసిన పరాగ్, కేవలం 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 90 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. సెంచరీ దిశగా సాగిన పరాగ్ పది పరుగుల దూరంలో అవుట్ అయి తృటిలో మైలురాయిని మిస్ చేసుకున్నాడు.
పరాగ్కు తోడుగా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (42; 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) అద్భుతమైన సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ మూడో వికెట్కు కేవలం 59 బంతుల్లోనే 102 పరుగుల మెరుపు భాగస్వామ్యాన్ని నెలకొల్పి రాజస్థాన్ను పటిష్ట స్థితిలో నిలిపారు. సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా 20 పరుగులతో పర్వాలేదనిపించగా, శుభమ్ దూబె (6) మాత్రం నిరాశపరిచాడు.
ఇన్నింగ్స్ ముగిసే సమయానికి స్కోరు మరింత పెరగడానికి డొనొవాన్ ఫెరీరా ఆడిన మెరుపు ఇన్నింగ్సే కారణం. కేవలం 14 బంతుల్లోనే 2 ఫోర్లు, ఏకంగా 6 సిక్సర్లతో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మైదానం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించిన ఫెరీరా, రాజస్థాన్ స్కోరును 220 దాటించాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్లో మొత్తంగా భారీ హిట్టింగ్ కనిపించింది.
గాయం కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరమై, ఈ సీజన్లో తన తొలి మ్యాచ్ ఆడుతున్న ఢిల్లీ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆకట్టుకున్నాడు. పరుగులను నియంత్రించడమే కాకుండా 3 కీలక వికెట్లు తీసి రాజస్థాన్ను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. ఇతర బౌలర్లలో కైల్ జెమీసన్, అక్షర్ పటేల్, మరియు నటరాజన్ తలో వికెట్ దక్కించుకున్నారు. మరి 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఎలా ఛేదిస్తుందో చూడాలి. రాజస్థాన్ బౌలర్లను ఎదుర్కొని ఢిల్లీ బ్యాటర్లు విజయం సాధిస్తారా లేక జైపూర్ కోటలో రాయల్స్ దే పైచేయి అవుతుందో వేచి చూడాలి.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













