Tirumala Temple: తిరుమలలో సినీ తారలు.. శ్రీవారిని దర్శించుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. సెల్ఫీల కోసం ఎగబడ్డ భక్తులు! | | ACTPnews

శ్రీవారిని


Last Updated:

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది, తమన్నా భాటియా మానస వారణాసి విఐపి దర్శనం, 78586 మంది దర్శనం, 29232 మంది తలనీలాలు, హుండీ ఆదాయం 3.27 కోట్లు

+

శ్రీవారిని దర్శిoచుకున్న ఇద్దరు టాప్ హీరోయిన్స్..!

కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులు భక్తజన సందోహంతో పోటెత్తాయి. నిత్యం వేలాది మంది సామాన్య భక్తులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకోవడం పరిపాటి. తాజాగా, టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా, మిస్ ఇండియా 2020 విజేత, నటి మానస వారణాసి తిరుమల వేంకటేశ్వర స్వామివారిని సందర్శించుకోవడం విశేషం.

ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో వీరిద్దరూ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ, అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీవారి సన్నిధిలో మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి పట్టువస్త్రంతో వీరిని సత్కరించి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఆలయం వెలుపలికి రాగానే హీరోయిన్ తమన్నాను చూసిన అభిమానులు, భక్తులు ఒక్కసారిగా ఆమె వైపు తరలివచ్చారు. తమ అభిమాన నటిని దగ్గరగా చూసేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఎంతో ఆసక్తి చూపారు. తమన్నా చిరునవ్వుతో భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆదివారం సెలవు దినం కావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. సుమారు 78,586 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా 29,232 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 3.27 కోట్ల ఆదాయం లభించింది.

ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 11 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఎటువంటి టోకెన్లు లేని (SSD) భక్తులకు స్వామివారి దర్శనం లభించడానికి సుమారు 8 నుండి 10 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, పాలు నిరంతరం అందుబాటులో ఉంచుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *