Ram Charan Peddi: విడుదలకు ముందే పెద్ది సంచలనం.. రామ్ చరణ్ కెరీర్‌లో అరుదైన రికార్డ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కలయికలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (Peddi). టాలీవుడ్‌లో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా, విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

News18
News18

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కలయికలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (Peddi). టాలీవుడ్‌లో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా, విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుండగా, ఓవర్సీస్‌లో ఒక రోజు ముందుగానే (జూన్ 3న) ప్రీమియర్ షోలు పడనున్నాయి.

నార్త్ అమెరికాలో రికార్డు స్థాయి ప్రీ-బుకింగ్స్:

ఓవర్సీస్ మార్కెట్‌లో ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో జరుగుతున్నాయి. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటంతో, ఈ చిత్రం రిలీజ్‌కు ముందే నార్త్ అమెరికాలో వన్ మిలియన్ డాలర్ల (1 Million) గ్రాస్ మార్క్‌ను దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. రాజమౌళి విజువల్ వండర్ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత, కేవలం ప్రీమియర్ షోల బుకింగ్స్ ద్వారానే రామ్ చరణ్‌కు ఈ స్థాయి వన్ మిలియన్ మార్క్ అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. చరణ్ గ్లోబల్ క్రేజ్‌కు ఈ వసూళ్లే నిదర్శనమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

గాయపడినా తగ్గని ‘మెగా’ శ్రమ: బుచ్చిబాబు ప్రశంసలు:

సినిమా విడుదల సమయం దగ్గర పడటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ రామ్ చరణ్ పడ్డ కష్టాన్ని కొనియాడారు. “పెద్ది పాత్ర అందరి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. అందుకు కారణం చరణ్ గారు ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడమే. ఈ సినిమా కోసం ఆయన ఎంతో శ్రమించారు. ముఖ్యంగా కుస్తీ (రెజ్లింగ్) సన్నివేశాల చిత్రీకరణలో చరణ్‌కు తీవ్రమైన దెబ్బలు తగిలాయి. ఒక దశలో కంటికి కూడా గాయమైంది. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఏమంటారో అని నాకు చాలా భయమేసింది. కానీ చరణ్ గారు ఆ నొప్పినైనా లెక్కచేయకుండా, షూటింగ్‌ను ఆపకుండా పూర్తి చేశారు” అని బుచ్చిబాబు ఎమోషనల్ అయ్యారు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించగా, విలక్షణ నటుడు జగపతి బాబు, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ కాంబినేషన్ జూన్ 4న థియేటర్లలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *