Janasena Varahi Vijaya Yatra : వారాహి విజయ యాత్ర మూడో విడతకు సంబంధించి కీలక ప్రకటన చేసింది జనసేన. ఇప్పటికే రెండు విడుతల విజయవంతం కాగా… మూడో విడుతను కూడా ప్రకటించింది. ఆగస్టు 10వ తేదీన విశాఖ సిటీ నుంచి మూడో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. అదే రోజు విశాఖపట్నంలో సభను నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ వెల్లడించింది. ఆగస్టు 19వ తేదీ వరకూ ఈ యాత్ర ఉంటుందని వెల్లడించారు.