Last Updated: Jun 29, 2026, 16:51 IST
తిరుపతిలోని అలిపిరి – జూపార్క్ రోడ్డు సమీపంలో శ్రీవారి చిత్రపటాల పట్ల జరిగిన తీవ్ర అపచారంపై టీటీడీ మాజీ చైర్మన్, వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. కొన్ని వందలు, వేల సంఖ్యలో ఉన్న స్వామి వారి ఫొటోలను అత్యంత నిర్లక్ష్యంగా మలమూత్రాలు, బీరు బాటిల్స్, చెత్తకుప్పల మధ్య పడేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవోలు ఊడిగం చేయడం మానేసి ఈ ఘోర నిర్లక్ష్యానికి సిగ్గుతో తలదించుకోవాలని ధ్వజమెత్తారు.












