Tirupati: క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే హత్య.. బుర్ఖా వేషంలో వచ్చి వృద్ధురాలి గొంతుకోసి.. నగలు కాజేసిన లోకోపైలట్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Tirupati: ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుంచి గట్టెక్కేందుకు ఒక రైల్వే లోకోపైలట్ దారుణమైన నేరానికి ఒడిగట్టాడు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

పక్కా ప్రణాళికతో, సినిమా ఫక్కీలో వేషం మార్చి, తెలిసిన వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా గొంతుకోసి హత్య చేసి.. బంగారం, నగదుతో పరారైన ఘరానా నేరస్తుడిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనాడు కథనం ప్రకారం.. తిరుపతి గ్రామీణ మండలం పరిధిలోని విజయనగర్ కాలనీ (సాయినగర్ పంచాయతీ)లో విశ్రాంత బ్యాంకు అధికారి కృష్ణారెడ్డి, జ్యోతి (69) దంపతులు నివసిస్తున్నారు. ఇటీవల కృష్ణారెడ్డి తన కుమారుడిని విదేశాలకు పంపించేందుకు బెంగళూరు వెళ్లడంతో జ్యోతి ఇంట్లో ఒంటరిగా ఉంది.

ఈ విషయాన్ని గమనించిన నిందితుడు పాళం రూపేష్ కుమార్ (36) అనే కృష్ణపట్నం రైల్వేస్టేషన్ లోకోపైలట్, ఆమె ఇంట్లోకి చొరబడి దారుణానికి ఒడిగట్టాడు. జ్యోతి బంధువులు నెల్లూరులో ఉండటంతో, వారి ద్వారా రూపేష్‌కి ఆమె కుటుంబంతో ముందే పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే వారి ఆర్థిక స్థితిగతులు, జ్యోతి ఒంటరిగా ఉన్న సమయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని ఈ ఘాతుకానికి వ్యూహం రచించాడు.

యూట్యూబ్ నేరాలు.. స్కార్ఫ్, బుర్ఖా వేషధారణ

పోలీసు చిక్కకుండా తప్పించుకునేందుకు రూపేష్ యూట్యూబ్‌లో పలు క్రైమ్ వీడియోలను వీక్షించాడు. ఎక్కడా తన మొబైల్ ఫోన్ వినియోగించకుండా, పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు చూసినా గుర్తుపట్టలేని విధంగా ప్లాన్ చేశాడు. కృష్ణపట్నంలో తన సహచర లోకోపైలట్‌కు చెందిన స్కూటీని దొంగిలించి, నల్లటి బుర్ఖా వేసుకుని, ముఖానికి స్కార్ఫ్, తలకు హెల్మెట్ ధరించి జ్యోతి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్లగానే ఆమెను బెదిరించి, లొంగదీసుకుని వంటగదిలోనే గొంతుకోసి కిరాతకంగా హతమార్చాడు. ఆమె చేతికి ఉన్న బంగారు ఉంగరం రాకపోవడంతో ఏకంగా చేతి వేలిని కత్తిరించాడు. అనంతరం ఇంట్లోని 20 గ్రాముల బంగారు నగలు, రూ. 47 వేల నగదు కాజేశాడు.

రాజంపేటలో స్కూటీ వదిలి.. దారి మళ్లించి

నేరం చేసిన తర్వాత కొన్ని గంటల పాటు ఆ ఇంట్లోనే గడిపిన రూపేష్, ఆపై దొంగిలించిన స్కూటీపై రాజంపేట బస్టాండ్‌కు చేరుకున్నాడు. స్కూటీని అక్కడే వదిలేసి, పోలీసుల దృష్టి మళ్లించేందుకు తిరుపతి, కడప మీదుగా తిరుగుతూ చివరికి కృష్ణపట్నం చేరుకున్నాడు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కదలికలను గమనించినప్పటికీ, ముఖం కప్పి ఉండటంతో గుర్తుపట్టడం కష్టమైంది. అయితే, నిందితుడు రాజంపేటలో వదిలేసిన స్కూటీ యొక్క ఇంజన్ నంబర్ ఆధారంగా అసలు యజమానిని పట్టుకుని, అతడు ఇచ్చిన క్లూతో రూపేష్ కుమార్‌ను కృష్ణపట్నం రైల్వేస్టేషన్ వద్ద అరెస్టు చేశారు.

అభినందించిన ఎస్పీ

సవాలుగా మారిన ఈ కేసును శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో ఛేదించిన అదనపు ఎస్పీలు శ్రీనివాసులు, రవి మనోహరాచారి, డీఎస్పీలు ప్రతాప్ ప్రసాద్, శ్యామ్‌కుమార్, సీఐలు మద్దయాచారి, శివకుమార్ రెడ్డి, అబ్బన్న, ఎస్సైల బృందాన్ని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేకంగా ప్రశంసించి, వారికి నగదు పురస్కారాలు (రివార్డులు) అందజేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed