హైడ్రా (HYDRAA) వ్యవస్థ, కమిషనర్ ఆర్. రంగనాథ్పై హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. హైడ్రాను అడ్డుపెట్టుకుని బిల్డర్ల నుంచి ‘RR టాక్స్’ వసూలు చేస్తున్నారని, ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఢిల్లీ వేదికగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణల్లో హైడ్రా ఒకటని స్పష్టం చేశారు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వ విచక్షణాధికారమని, హైకోర్టు ఉత్తర్వులను సమీక్షించి ఉన్నత న్యాయస్థానాల్లో సవాల్ చేస్తామని, ఆక్రమణదారులపై హైడ్రా పోరాటం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని సీఎం రేవంత్ ప్రకటించారు.













