Last Updated:
Arjuna Awards: వివిధ క్రీడాంశాల్లో అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన భారత క్రీడాకారులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వర్ధమాన క్రీడాకారులు ‘అర్జున’ పురస్కారానికి ఎంపికై సత్తా చాటారు. హైదరాబాద్కు చెందిన యువ బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గాయత్రి గోపీచంద్తో పాటు అంతర్జాతీయ వేదికలపై అద్భుతంగా రాణిస్తున్న బధిర షూటర్ ధనుష్ శ్రీకాంత్ను కేంద్రం అర్జున అవార్డుతో గౌరవించింది. దేశవ్యాప్తంగా మొత్తం 17 మంది ప్రతిభావంతులైన అథ్లెట్లను ఈసారి అర్జున పురస్కారం వరించింది.














