అలా చర్చలు జరుగుతున్న సమయంలో వరుణ్ తేజ్ పేరు తెరపైకి వచ్చింది. కథకు, పాత్రకు వరుణ్ తేజ్ బాగా సరిపోతాడని భావించి అతడినే హీరోగా ఫైనల్ చేశారు. ఇక హీరోయిన్గా సాయి పల్లవిని తీసుకోవడం సినిమాకు మరో బలంగా మారింది. 2017లో విడుదలైన ‘ఫిదా’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. శేఖర్ కమ్ముల మార్క్ ప్రేమకథ, తెలంగాణ యాస, సహజమైన ఎమోషన్స్, సాయి పల్లవి అద్భుతమైన నటన, వరుణ్ తేజ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా భానుమతి పాత్రలో సాయి పల్లవి చేసిన హంగామా అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుంది.













