Aadarsha Kutumbam AK47: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’ హౌస్ నెం.47 రిలీజ్ డేట్ వచ్చేసింది.. పండుగకి బాక్సాఫీస్‌పై దండయాత్ర! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 – ఏకే47’ చిత్రానికి విడుదల తేదీని ప్రకటించారు. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్ర కొత్త పోస్టర్లు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచాయి.

News18
News18

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 – ఏకే47’ (AK47)పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిన నేపథ్యంలో, తాజాగా చిత్రబృందం విడుదల చేసిన కొత్త పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పోస్టర్ల ద్వారా సినిమాపై మరింత ఆసక్తిని పెంచిన మేకర్స్, అదే సమయంలో విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.

వెంకటేష్ దగ్గుబాటి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా కొత్త పోస్టర్లను షేర్ చేస్తూ, “ప్రతి కుటుంబం గుర్తుంచుకునే ఒక ప్రత్యేక తేదీ.. #AadarshaKutumbam ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది” అంటూ ప్రకటించారు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా దసరా సీజన్‌లో విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

వెంకటేష్ పోస్ట్‌పై అభిమానులు కూడా ఆసక్తికరంగా స్పందించారు. “వెంకీ బీ లైక్: దసరా నాదే.. సంక్రాంతి నాదే” అంటూ ఓ అభిమాని కామెంట్ చేయగా, మరో నెటిజన్ “అక్టోబర్ 2న ప్రవచనాలు వినడానికి వెళ్లరు కదండీ” అంటూ సరదాగా స్పందించారు. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, 2025లోనే వెంకటేష్ దగ్గుబాటి, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 – ఏకే47’ అనే ఆసక్తికరమైన టైటిల్ ప్రకటించగానే సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఈ సినిమాతో వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

ఈ చిత్రానికి సంబంధించిన తొలి పోస్టర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. వెంకటేష్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఈ సినిమాను ప్రకటిస్తూ, “ప్రెజెంటింగ్ #VenkateshXTrivikram as ‘Aadarsha Kutumbam House No: 47 – AK47’. షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. 2026 సమ్మర్‌లో థియేటర్లలో కలుద్దాం” అని పేర్కొన్నారు. ఈ పోస్టర్‌ను బట్టి చూస్తే, ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో యాక్షన్, కామెడీ అంశాలు కూడా పుష్కలంగా ఉండనున్నాయని సమాచారం.

ఇదిలా ఉంటే, వెంకటేష్ ప్రస్తుతం మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో కూడా నటిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఇటీవల అధికారికంగా ప్రారంభమైంది. తాత్కాలికంగా ‘వెంకీ అనిల్ 5’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం జూన్ 18న హైదరాబాద్‌లో సంప్రదాయ ముహూర్త కార్యక్రమాలతో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను సురేష్ ప్రొడక్షన్స్ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియోలో వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్ కనిపించారు. “ANDDDDD!!!! #VenkyAnil5 – #NKRAR2 స్టైల్‌గా ప్రారంభమైంది. ఈ మ్యాడ్‌నెస్‌లోకి కీర్తి సురేష్, కృతి శెట్టికి స్వాగతం” అంటూ పోస్ట్ చేశారు. ఈ చిత్రంపై కూడా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మొత్తానికి, ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 – ఏకే47’ సినిమాకు విడుదల తేదీ ఖరారవడంతో వెంకటేష్ అభిమానుల్లో ఆనందం రెట్టింపైంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ దసరా బరిలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *