Last Updated:
తిరుమల డిప్యూటీ ఈఓ లోకనాథం నివాసంపై ఏసీబీ సోదాలు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న అనుమానంతో తనిఖీలు.
తిరుమల శ్రీవారి ఆలయ టెంపుల్ డిప్యూటీ ఈవో లోకనాథం నివాసంపై ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్న సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అనుమానాలతో బుధవారం ఉదయం నుంచి తిరుపతిలోని పెద్దకాపు లేఔట్లో ఉన్న ఆయన నివాసంతో పాటు తిరుమలలోని కార్యాలయం సహా మొత్తం ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో లోకనాథం ఇంట్లో భారీగా బంగారం, వెండి గుర్తించినట్లు సమాచారం.













