కళలు, విద్యకు అధిష్టాన దేవత: కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని ఇతర ఆలయాల కంటే ప్రత్యేకంగా నిలబెట్టేది విద్య, జ్ఞానం, కళలతో ఉన్న అనుబంధం. మూకాంబిక దేవి సరస్వతి దేవి స్వరూపంగా భావించబడుతుంది. అందుకే విద్యార్థులు, రచయితలు, సంగీత విద్వాంసులు, నటీనటులు, కళాకారులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ప్రతి ఏడాది వేలాది కుటుంబాలు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు ఇక్కడికి వస్తుంటాయి. అమ్మవారి ఆశీస్సులతో విద్య, సంగీతం, సాహిత్యం, కళారంగాల్లో విజయం సాధిస్తారనే నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది.













