Last Updated:
Annapoorani scheme: ఈ పథకం ద్వారా తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 1 కోటి 30 లక్షల కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, యుద్ధ వాతావరణం కారణంగా వంట గ్యాస్ ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయనీ, దీనివల్ల సామాన్య గృహిణులపై పడుతున్న భారాన్ని తగ్గించాలన్నదే తన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి విజయ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రజలకు ఒక భారీ శుభవార్తను అందించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలలో ఒకటైన ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుడుతూ, పేద కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కలిగించే దిశగా అధికారిక ప్రకటన చేశారు. ఈ సరికొత్త పథకానికి ‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ (Annapoorani Super Six) అని పేరు పెట్టారు. ఇండియా టుడే ప్రచురించిన తాజా కథనం ప్రకారం, ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన పేద కుటుంబాలకు సంవత్సరానికి 3 ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ల (రీ-ఫిల్)ను ఉచితంగా ఇస్తారు. ఈ పథకం రాబోయే జనవరిలో జరుపుకునే పొంగల్ పండుగ కానుకగా లాంఛనంగా ప్రారంభం కానుంది. అంటే.. సంక్రాంతి నుంచి అనుకోవచ్చు.














