AP CM Chandrababu Naidu | వేల కోట్లు ఉన్నా.. ఆరోగ్యం లేకపోతే వేస్ట్! | ACTPnews

AP CM Chandrababu Naidu | వేల కోట్లు ఉన్నా.. ఆరోగ్యం లేకపోతే వేస్ట్!



గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో సరికొత్తగా ఏర్పాటైన ‘లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. ఏ వ్యవస్థకైనా ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత ఉంటేనే మనుగడ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. “ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు.. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులు” అని చెబుతూ.. వేల కోట్లు, పదవులు ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదని గుర్తుచేశారు. 600 పడకల సామర్థ్యం, 900 మంది సిబ్బందితో ఏకంగా 32 విభాగాల్లో వైద్య సేవలు అందిస్తున్న లలిత ఆసుపత్రి భవిష్యత్తులో ఒక గొప్ప ల్యాండ్ మార్క్గా నిలవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports