Last Updated:
అరుణాచల్ ప్రదేశ్పై పదేపదే విషం చిమ్ముతున్న చైనాకు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. త్వరలో బ్రిక్స్ సదస్సు జరగనున్న వేళ, అరుణాచల్లోని 27 కీలక సరిహద్దు ప్రాంతాలతో అధికారిక మ్యాప్ను విడుదల చేస్తూ డ్రాగన్ దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
డ్రాగన్కు దిమ్మతిరిగే కౌంటర్ భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్పై కన్నేసి, పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు కేంద్ర ప్రభుత్వం గట్టి బుద్ధి చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్ను తమ భూభాగంగా (జాంగ్నాన్) చెప్పుకుంటూ చైనా ఇటీవల ఒక మ్యాప్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి దీటుగా సమాధానం ఇస్తూ, భారత్ సరికొత్త అధికారిక మ్యాప్ను రూపొందించింది. త్వరలో జరగనున్న బ్రిక్స్ (BRICS) సదస్సు నేపథ్యంలో, అరుణాచల్ ప్రదేశ్లోని 27 కీలక సరిహద్దు ప్రాంతాలను స్పష్టంగా పొందుపరుస్తూ భారత సర్వే ఆఫ్ ఇండియా ఈ మ్యాప్ను అప్డేట్ చేసినట్లు ఇండియా టుడే కథనం పేర్కొంది.














