Last Updated:
Baba Ramdev: ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఈమధ్య కాలంలో విద్యార్ధులు నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, వారిపై కేసులు నమోదవడం, లాఠీఛార్జ్లు జరగడం వంటి ఘటనలు చూసి చలించిపోయిన ఆయన దేశ బాల్యం, యువత ప్రమాదంలో ఉందన్నారు.
Baba Ramdev: ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఈమధ్య కాలంలో విద్యార్ధులు నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, వారిపై కేసులు నమోదవడం, లాఠీఛార్జ్లు జరగడం వంటి ఘటనలు చూసి చలించిపోయిన ఆయన దేశ బాల్యం, యువత ప్రమాదంలో ఉందన్నారు. రేపు భావి భారత పౌరులుగా మారాల్సిన విద్యార్ధులు ఈవిధంగా నిరసనలు చేస్తే ఇంకా ఎప్పుడు చదువుకుంటారని కామెంట్ చేశారు. అంతే కాదు ఢిల్లీ అటుపై జార్ఖాండ్లో పేపర్ లీక్ కావడం చూస్తుంటే అభం శుభం తెలియని విద్యార్ధులను ఈ నిరసనల్లో వాడుకుంటున్నారని ఆరోపించారు. అంతే కాదు ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పించాలన్నారు. అంతే కాదు ప్రభుత్వ విద్య, వైద్యం నాణ్యత పెంచేందుకు ప్రభుత్వ ఉద్యోగులే కీలక పాత్ర పోషించాలని సూచించారు బాబా రామ్దేవ్.














