తిరుమల శ్రీవార భక్తులకు సరికొత్త ఆధ్యాత్మిక, సాంకేతిక అనుభూతిని అందించేందుకు నిర్మించిన పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ (వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1)తో పాటు రూ.104 కోట్లతో ఆధునీకరించిన శ్రీ వేంకటేశ్వర (SV) మ్యూజియంను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ట్రస్ట్ సౌజన్యంతో పునర్నిర్మించిన ఈ మ్యూజియంలో 3D, 7D టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ (VR) దర్శనం, AI డిజిటల్ డిస్ప్లేలతో శ్రీవారి దివ్య రూపాన్ని, నిత్య కైంకర్యాలను, విజయనగర రాజుల కాలం నాటి కానుకల రీప్రొడక్షన్లను ఏర్పాటు చేశారు. అలాగే రిలయన్స్, భారత్ బయోటెక్ విరాళంగా అందించిన 32 విద్యుత్ బస్సులను కూడా సీఎం ప్రారంభించారు.
#Tirumala #ChandrababuNaidu #PilgrimsExperienceCentre #SVMuseum #TTDNews













