CWG 2030: గ్లాస్గో టు అహ్మదాబాద్.. 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమివ్వనున్న భారత్! | క్రీడా వార్తలు | ACTPnews

PC: X.com


Last Updated:

CWG 2030: గ్లాస్గో వేదికగా రెండు వారాల పాటు జరిగిన కామన్వెల్త్ క్రీడలు ఘనంగా ముగిశాయి. స్కాట్లాండ్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ ప్రారంభమైన ఈ వేడుకలు, భారత్ సంస్కృతి, సంగీతం, ఆధునిక ఆకాంక్షల మేళవింపుతో కంటికి ఇంపుగా సాగాయి.

PC: X.com
PC: X.com

మరో నాలుగేళ్లలో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం సిద్ధంగా ఉందనే సందేశాన్ని ఈ వేడుకలు చాటిచెప్పాయి. ఈ ముగింపు వేడుకల్లో అత్యంత కీలక ఘట్టం అధికారిక ఆతిథ్య బాధ్యతల అప్పగింత. కామన్వెల్త్ గేమ్స్ పతాకాన్ని గ్లాస్గో లార్డ్ ప్రొవోస్ట్ జాక్వెలిన్ మెక్‌లారెన్ నుంచి స్కాట్లాండ్ కామన్వెల్త్ గేమ్స్ వైస్-ఛైర్ సుసాన్ జాక్సన్, స్కాటిష్ నెట్‌బాల్ క్రీడాకారిణి ఎమ్మిలీ నికోల్, కామన్వెల్త్ స్పోర్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ డోనాల్డ్ రుకారే, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, ఐఓఏ (IOA) అధ్యక్షురాలు పి.టి. ఉషల ద్వారా గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవికి చేతులకు అందజేయడంతో ఈ ప్రక్రియ పూర్తయింది.

2010లో న్యూఢిల్లీ తర్వాత భారత్ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమివ్వడం ఇది రెండోసారి కాగా, 2030లో జరగబోయే ఈ ఈవెంట్ కామన్వెల్త్ గేమ్స్ శతాబ్ది (Centenary) వేడుక కావడం విశేషం. బ్రిటన్ రాజా చార్లెస్ III తరఫున ఎడిన్‌బర్గ్ డ్యూక్ ప్రిన్స్ ఎడ్వర్డ్ క్రీడల ముగింపును అధికారికంగా ప్రకటిస్తూ, కామన్వెల్త్ అథ్లెట్లందరినీ 24వ కామన్వెల్త్ క్రీడల కోసం భారత్‌లోని అహ్మదాబాద్‌కు ఆహ్వానించారు.

ఆతిథ్య బాధ్యతల అప్పగింత అనంతరం భారత్ “వసుధైవ కుటుంబకం” (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే సిద్ధాంతంతో రూపొందించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నటి మానుషి ఛిల్లర్ నేతృత్వంలో ‘వందేమాతరం’ 150 ఏళ్ల వేడుకలను పురస్కరించుకుని ప్రదర్శించిన నృత్య రూపకం విశేషంగా నిలిచింది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు శంకర్ మహదేవ్ సింఫనీ సంగీతం దానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. సితార్ విద్వాంసుడు రిషబ్ శర్మ, స్కాటిష్ సంగీతకారుడు రోస్ ఐన్స్లీ కలిసి ప్రదర్శించిన ‘ది కల్చరల్ జుగల్బందీ’ భారత-స్కాటిష్ సంస్కృతుల కలయికకు అద్దం పట్టింది. శంకర్ మహదేవ్ ఆయన కుమారులు సిద్ధార్థ్, శివమ్‌లతో కలిసి “సునో గౌర్ సే దునియా వాలోన్”, “భాగ్‌ మిల్కా భాగ్”, “ఏ వతన్”, “లేహరా దో” వంటి దేశభక్తి గీతాలను ఆలపించగా, గుజరాతీ గాయని భూమి త్రివేది ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. మహిళల 57 కేజీల బాక్సింగ్‌లో పసిడి నెగ్గిన జైస్మీన్ లంబోరియా ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా వ్యవహరించారు.

39 పతకాలతో నాలుగో స్థానంలో భారత్

గ్లాస్గో క్రీడల్లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలు సాధించి పతకాల పట్టికలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడాల తర్వాత నాలుగో స్థానంలో నిలిచారు. ఆతిథ్య స్కాట్లాండ్ కూడా 39 పతకాలు సాధించినప్పటికీ, రజత పతకాల సంఖ్య తక్కువగా ఉండటంతో భారత్ కంటే దిగువన నిలిచింది.

గత బర్మింగ్‌హామ్ క్రీడల్లో భారత్ సాధించిన 61 పతకాలతో పోలిస్తే ఈసారి సంఖ్య తగ్గినప్పటికీ, భారత్‌కు బలమైన షూటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, హాకీ, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడలను 2026 ప్రణాళిక నుంచి తొలగించడమే దీనికి ప్రధాన కారణం. గతంలో సాధించిన పతకాలలో 30 పతకాలు ఈ తొలగించిన క్రీడల నుంచే రావడం గమనార్హం. పరిమిత క్రీడలు, చిన్న బృందంతో బరిలోకి దిగినప్పటికీ భారత క్రీడాకారులు విశేష రాణింపుతో దేశ కీర్తిపతాకాన్ని సగర్వంగా ఎగరవేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports