Last Updated:
Delhi: దేశ రాజధాని ఢిల్లీ NCRలో ఓ మైనర్ బాలికపై బస్సులో అత్యాచారానికి పాల్పడిన కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసిన నిందితుల్లో బస్సు డ్రైవర్, కండక్టర్ని అరెస్ట్ చేశారు పోలీసులు.
Delhi: దేశ రాజధాని ఢిల్లీ NCRలో ఓ మైనర్ బాలికపై బస్సులో అత్యాచారానికి పాల్పడిన కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసిన నిందితుల్లో బస్సు డ్రైవర్, కండక్టర్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆగస్టు 4వ తేది రాత్రి జరిగిన ఈ ఘటనలో 45 నిమిషాలపాటు రోడ్డుపై తిప్పుతూ కామాంధులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లుగా నిర్ధారించారు. ఇద్దర్ని అరెస్ట్ చేసి బస్సును సీజ్ చేసినట్లుగా ఢిల్లీ పోలీసులు తెలిపారు. బస్సులో ఫోరెన్సిక్ నిపుణులతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే తరహాలో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ కేసు కూడా అదే విధంగా వైరల్ అవుతోంది.














