Last Updated:
Digital Shram Sankalp: దేశవ్యాప్తంగా టెక్ నిపుణుల నుంచి వస్తున్న విశేష స్పందనను, వినూత్న ఆలోచనల ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి మరింత అవకాశం కల్పించే ఉద్దేశ్యంతో ఈ గడువును పొడిగించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
భారత కార్మిక వ్యవస్థను సరికొత్తగా మార్చే ఉద్దేశ్యంతో, భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘డిజిటల్ శ్రమ్ సంకల్ప్: రీఇమాజినింగ్ ఇండియాస్ లేబర్ ఎకోసిస్టమ్ విత్ ఏఐ’ (Digital Shram Sankalp) ఐడియేషన్ హ్యాకథాన్ దరఖాస్తుల గడువును కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పొడిగించింది. తాజా ప్రకటన ప్రకారం, ఈ జాతీయ స్థాయి హ్యాకథాన్లో పాల్గొనడానికి చివరి తేదీని 2026 సెప్టెంబర్ 18 వరకు పొడిగిస్తూ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సాంకేతిక నిపుణులు, విద్యార్థులు, స్టార్టప్లు, పరిశోధకులు.. తమ ప్రతిభను చాటుకోవడానికి ఇది ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా టెక్ నిపుణుల నుంచి వస్తున్న విశేష స్పందనను, వినూత్న ఆలోచనల ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి మరింత అవకాశం కల్పించే ఉద్దేశ్యంతో ఈ గడువును పొడిగించినట్లు అధికారులు స్పష్టం చేశారు.














