Last Updated:
Har Ghar Tiranga: జాతీయ జెండాను పట్టుకుంటే.. కలిగే ఫీల్ మాటలకు అందనిది. మనలో దేశ భక్తి ఉప్పొంగుతుంది. సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ.. ముందడుగులు వేస్తూ.. ర్యాలీలు చెయ్యడం ద్వారా.. దేశ భక్తిని చాటుకుంటున్నాం.
ఢిల్లీలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ భారీ ఉత్సాహంతో సాగుతోంది. యువత, విద్యార్థులు, నాయకులు అందరూ ఒక్కటై జాతీయ జెండాను చేతబూని ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, ప్రధాని నరేంద్ర మోదీ స్వప్నం నెరవేరినట్లుగా దేశవ్యాప్తంగా దేశభక్తి ఉత్సవంగా మారింది. 2026లో భారతదేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వందేమాతరం జాతీయ గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ప్రత్యేకంగా దీన్ని నిర్వహిస్తున్నారు.














