Last Updated: Aug 01, 2026, 18:35 IST
భారత వాతావరణ శాఖ (IMD) దేశంలోని పలు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర భారతదేశం, ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చే వారం పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని IMD తెలిపింది. పంజాబ్, హర్యానాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముండగా, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో మాత్రం తేలికపాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇక కేరళ, తీర కర్ణాటక, దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.













