Last Updated:
IND vs JPN: ఆసియా క్రీడల ప్రారంభానికి ముందు అంతర్జాతీయ క్రికెట్ వేదికపై సరికొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది.
భారత్, జపాన్ జట్ల మధ్య ఏకైక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. జపాన్లోని తొచిగి ప్రిఫెక్చర్లో గల ప్రసిద్ధ శానో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 22న ఈ సమరం జరగనుంది. భారత్-జపాన్ దేశాల ద్వైపాక్షిక దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవ సంబరాల ప్రారంభానికి సూచికగా, సుజుకీ కప్ పేరిట ఈ మ్యాచ్ను నిర్వహిస్తున్నారు. అగ్రశ్రేణి జట్లలో ఒకటైన టీమ్ఇండియా మరో సరికొత్త గడ్డపై అడుగుపెట్టడం ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.














