ఆసుపత్రి వైద్యులు, బాలకృష్ణ, ‘అనంతపురం జగన్’ అందించిన ధైర్యంతో స్వప్న ప్రాణాంతక క్యాన్సర్ను జయించింది. తనకు పునర్జన్మనిచ్చిన బసవతారకం ఆసుపత్రిని దేవాలయంగా అభివర్ణిస్తూ, బాలకృష్ణకు, తనకు అండగా నిలిచిన ‘జగన్ సార్’కు ఆమె వేదికపైనే కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. తన ప్రసంగంలో ఆమె ‘జగన్ సార్’కు కృతజ్ఞతలు చెప్పడంతో వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలోమాజీ సీఎం జగన్ పేరు ప్రస్తావించినట్లుగా భావించి ఆ వీడియోను షేర్ చేశారు. అయితే క్యాన్సర్ పేషెంట్కి సహాయం చేసింది వైఎస్ జగన్ కాదని అనంతపురం జగన్ అని ఇప్పుడు టీడీపీ, నందమూరి ఫ్యాన్స్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.













