Karnataka: సీఎం కుర్చీకి గుడ్‌బై చెప్పిన సిద్దరామయ్య.. కేబినెట్ రద్దు చేస్తున్నట్లు ప్రకటన | | ACTPnews

(ఫైల్ ఫోటో: పీటీఐ)


Last Updated:

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు తన మంత్రివర్గ సహచరులకు తెలియజేయడంతో, రాష్ట్ర ప్రభుత్వంలో నాయకత్వ మార్పునకు నాంది పడింది.

(ఫైల్ ఫోటో: పీటీఐ)
(ఫైల్ ఫోటో: పీటీఐ)

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం తన మంత్రివర్గ సహచరులకు తాను ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలియజేశారు. దీంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ప్రధాన నాయకత్వ మార్పు ప్రారంభమైనట్లు సంకేతం అందింది. హైకమాండ్ ఆదేశాల మేరకు నేను రాజీనామా చేస్తున్నాను,” అని సమావేశంలో సిద్ధరామయ్య తన కేబినెట్ సహచరులతో అన్నారు.

“తదుపరి ముఖ్యమంత్రిని హైకమాండ్ నిర్ణయిస్తుంది,” అని ఆయన ఇంకా పేర్కొంటూ, కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఎవరు నడిపించాలనే దానిపై కాంగ్రెస్ నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తన తర్వాత బాధ్యతలు చేపట్టేవారికి పూర్తి మద్దతు ఉంటుందని కూడా హామీ ఇచ్చారు. “తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఎంపికైనా, వారికి నా పూర్తి సహకారం ఉంటుంది,” అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా విస్తృతంగా పరిగణించబడుతున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు పలువురు కేబినెట్ సహచరులు ఈ అల్పాహార సమావేశానికి హాజరయ్యారు.

రాజీనామా ఊహాగానాలకు తెరపడింది

కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత అవగాహనలో భాగంగా శివకుమార్‌కు మార్గం సుగమం చేసేందుకు సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకుంటారని కొన్ని రోజులుగా తీవ్రమైన ఊహాగానాలు చెలరేగాయి. రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు మార్గం సుగమం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ సిద్దరామయ్యను కోరినట్లు వార్తలు వెలువడటంతో రాజకీయ పరిణామాలు వేగవంతమయ్యాయి. సిద్ధరామయ్య గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌తో అపాయింట్‌మెంట్ కోరినట్లు, తన రాజీనామాను లాంఛనంగా సమర్పించేందుకు ఆ రోజు తర్వాత ఆయనను కలవనున్నట్లు సమాచారం. అయితే, గవర్నర్ బెంగళూరులో లేరని, వ్యక్తిగత కారణాలతో ఇండోర్‌కు వెళ్లారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.

ఢిల్లీలో ఉన్నత స్థాయి కాంగ్రెస్ సమావేశాలు

ఈ వారం ప్రారంభంలో ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం పాల్గొన్న కీలక సమావేశాల అనంతరం కర్ణాటకలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం సిద్ధరామయ్య, శివకుమార్‌లను జాతీయ రాజధానికి పిలిపించగా, అక్కడ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో వరుస సమావేశాలు జరిగాయి. రాహుల్ గాంధీ నుండి నేరుగా సందేశం రావడంతో సిద్ధరామయ్య చివరికి రాజీనామా చేయడానికి అంగీకరించారని కొన్ని వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ స్వయంగా కోరితే తాను పదవి నుంచి వైదొలుగుతానని కర్ణాటక ముఖ్యమంత్రి గతంలో పలుమార్లు చెబుతూ వచ్చారు.

దీర్ఘకాలంగా కొనసాగుతున్న అధికార భాగస్వామ్య ఊహాగానాలు

సిద్ధరామయ్య, శివకుమార్‌ల మధ్య నాయకత్వ పోరు 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటి నుంచి మొదలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇద్దరు నాయకులు ముఖ్యమంత్రి పదవికి బలమైన పోటీదారులుగా నిలిచారు. పార్టీ నాయకత్వం చివరకు శివకుమార్‌ను ఉప ముఖ్యమంత్రి పదవిని అంగీకరించేలా ఒప్పించగా, సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *