Mahesh Babu: వారణాసి మూవీపై రాజమౌళి ఊర మాస్ ప్లాన్.. మహేష్ బాబు బర్త్ డే రోజు పూనకాలే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ప్రతి ఏటా ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన టీజర్లు, గ్లింప్స్ లేదా మోషన్ పోస్టర్లతో అభిమానులకు విందు దొరకడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది రాజమౌళి కొత్త ప్లాన్ చేశారట.

News18
News18

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (SSMB29). భారతీయ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రతి ఏటా ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన టీజర్లు, గ్లింప్స్ లేదా మోషన్ పోస్టర్లతో అభిమానులకు విందు దొరకడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ నుంచి ఒక పవర్ ఫుల్ విజువల్ గ్లింప్స్ విడుదలవుతుందని ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి వస్తున్న తాజా సమాచారం ప్రకారం అభిమానులకు ఒక చిన్న నిరాశ తప్పక పోవచ్చు.

మహేష్ బాబు పుట్టినరోజుకు అభిమానులు ఆశిస్తున్నట్లుగా ‘వారణాసి’ నుంచి ఎలాంటి వీడియో గ్లింప్స్ లేదా టీజర్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దానికి బదులుగా, మహేష్ బాబు సరికొత్త మేకోవర్‌ను, నయా లుక్‌ను ఆవిష్కరిస్తూ ఒక ప్రత్యేకమైన బర్త్డే పోస్టర్‌ను మాత్రమే విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రాజమౌళి ప్రమోషనల్ వ్యూహాలు చాలా భిన్నంగా ఉంటాయి. సినిమాలోని కీలకమైన విజువల్స్, కాన్సెప్ట్ వీడియోలను ఇప్పుడే బయటకు వదలకుండా.. సినిమా విడుదలకు కొద్ది నెలల ముందు మాత్రమే ప్రమోషన్ల హోరెత్తించడం జక్కన్న స్టైల్. అందుకే అద్భుతమైన విజువల్స్‌ను ఇప్పుడే రివీల్ చేయకుండా, తగిన సమయం వచ్చే వరకు దాచిపెట్టి కేవలం ఒక స్పెషల్ పోస్టర్‌తోనే ఈ బర్త్డేను జరపాలని ఆయన బృందం ప్లాన్ చేసినట్లు సమాచారం.

80 శాతం షూటింగ్ పూర్తి.. ఏప్రిల్ 2027లో గ్రాండ్ రిలీజ్!

ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా ముందుకు సాగుతోంది. సినీ వర్గాల టాక్ ప్రకారం ఇప్పటికే దాదాపు 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన భాగాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి, సుదీర్ఘ కాలం పాటు అత్యున్నత ప్రమాణాలతో విజువల్ ఎఫెక్ట్స్ (VFX), పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోని విధంగా, ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ అంతర్జాతీయ విజువల్ వండర్‌ను 2027, ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా బాలీవుడ్ కమ్ హాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. అలాగే, మలయాళ వర్సటైల్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ‘కుంభ’ అనే అత్యంత పవర్ఫుల్ విలన్/కీలక పాత్రలో కనిపించనున్నారు. సీనియర్ నిర్మాత కె.ఎల్. నారాయణ (దుర్గా ఆర్ట్స్) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి, రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి అందించే సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వీడియో గ్లింప్స్ రాకపోయినా, జక్కన్న డిజైన్ చేసే ఆ ఒక్క స్పెషల్ పోస్టర్ అయినా మహేష్ అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయం.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed