పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై నిప్పులు చెరిగారు. రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆమె భవానీపూర్ నియోజకవర్గంలో పర్యటించి, పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ బలవంతంగా ఎన్నికలను రిగ్గింగ్ చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రం వెలుపల నుంచి వచ్చిన ఎన్నికల పరిశీలకులు (Observers) బీజేపీ ఏజెంట్లలా పనిచేస్తున్నారని, టీఎంసీ ఏజెంట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్ర బలగాలు (CRPF) స్థానిక పోలీసుల ప్రమేయం లేకుండా అర్థరాత్రి పూట టీఎంసీ కౌన్సిలర్ల ఇళ్లపై దాడులు చేస్తున్నాయని, ఇది ముమ్మాటికీ “టెర్రరిజం” అని ధ్వజమెత్తారు. “మా కార్యకర్తలు, బెంగాల్ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు.. బీజేపీ అక్రమాలకు భయపడం” అని దీదీ స్పష్టం చేశారు.
Source link
Mamata Alleges BJP Rigging | బీజేపీ రిగ్గింగ్ చేస్తోంది..దీదీ సంచలన కామెంట్స్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










