బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు రాజకీయ సెగలు రాజుకున్నాయి. దక్షిణ కోల్కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్ స్ట్రాంగ్ రూమ్ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సందర్శించారు. ఆమె పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను ఇక్కడే భద్రపరిచారు. ఈవీఎంల తారుమారుకు ప్రయత్నిస్తే ఊరుకోబోనని, ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఆమె హెచ్చరించారు. మరోవైపు, ఉత్తర కోల్కతా ఈవీఎంలు ఉన్న నేతాజీ ఇండోర్ స్టేడియం వద్ద టీఎంసీ నేతలు శశి పాంజా, కునాల్ ఘోష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా బ్యాలెట్ బాక్సులను తరలిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద టీఎంసీ శ్రేణులు పహారా కాస్తున్నాయి.
Source link
Mamata visits EVM strong room: ఈవీఎంలకు సీఎం మమతా కాపలా “ఈవీఎంలు ముట్టుకుంటే ఖబర్దార్”! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










