Milk ATM: కేవలం రూ.10కే పాలు.. మిల్క్ ఏటీఎం అదిరిపోయింది, ఎనీటైమ్ మిల్క్! | | ACTPnews

Milk ATM: కేవలం రూ.10కే పాలు.. మిల్క్ ఏటీఎం అదిరిపోయింది,  ఎనీటైమ్ మిల్క్!


Last Updated:

ఐటీ ఉద్యోగాన్ని వదులుకున్న ఒక యువకుడు 24 గంటల ‘మిల్క్ ఏటీఎం’ను ప్రారంభించాడు. స్వచ్ఛమైన పాలను క్యూఆర్ కోడ్, స్మార్ట్ కార్డుల ద్వారా ప్రజలు నేరుగా కొనుగోలు చేసే అద్భుతమైన సదుపాయం ఇది.

Milk ATM: కేవలం రూ.10కే పాలు.. మిల్క్ ఏటీఎం అదిరిపోయింది,  ఎనీటైమ్ మిల్క్!
Milk ATM: కేవలం రూ.10కే పాలు.. మిల్క్ ఏటీఎం అదిరిపోయింది, ఎనీటైమ్ మిల్క్!

మంచి జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకున్నాడు.. తన సొంత ఊరి ప్రజలకు స్వచ్ఛమైన ఆవు పాలు అందించడమే లక్ష్యంగా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. మధురై నగరంలో 24 గంటల పాటు పనిచేసే తొలి ‘మిల్క్ ఏటీఎం’ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ వినూత్న ఆలోచనతో ప్రారంభమైన సేవలు స్థానికుల నుంచి విశేష స్పందన పొందుతున్నాయి. ‘కణ్మణి అగ్రి గ్రూప్’ ఆధ్వర్యంలో ‘ఫ్రెష్ కణ్మణి మిల్క్’ పేరుతో ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ నిర్వాహకుడు ఒకప్పుడు ఐటీ రంగంలో పనిచేసేవాడు. చెన్నై, బెంగళూరు లాంటి మహానగరాలకు వెళ్లకుండా తన సొంతూరు మధురైలోనే వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఆరేళ్ల క్రితం ఈ ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. ప్రజలకు నేరుగా (డైరెక్ట్ టు కస్టమర్) నాణ్యమైన పాలు విక్రయించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.

ఈ మిల్క్ ఏటీఎంలో నింపే పాలకు సంబంధించి కఠినమైన ప్రమాణాలు పాటిస్తున్నారు. పాలను సేకరించిన వెంటనే ల్యాబ్‌లో 16 రకాల నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తారు. ఎటువంటి క్రీమ్ కలపని స్వచ్ఛమైన ఆవు పాలను ఏటీఎంలో నింపుతారు. రోజూ కొత్త పాలను మాత్రమే ఇందులో పోస్తారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ అత్యాధునిక ఏటీఎం మెషిన్ సామర్థ్యం 200 లీటర్లు. పాలను 5 నుంచి 6 గంటల పాటు నిరంతరంగా చల్లగా ఉంచే ప్రత్యేక శీతలీకరణ వ్యవస్థ ఇందులో ఉంది. ఈ మెషిన్ పూర్తిగా స్థానిక తమిళ భాషలో పనిచేసేలా రూపొందించారు. దీంతో చదువురాని సామాన్యులు కూడా ఇతరుల సహాయం అవసరం లేకుండా చాలా సులభంగా పాలు తీసుకునే అవకాశం కలుగుతోంది.

ఇది కూడా చదవండి: TGSRTC Bus Bharosa: ఆర్‌టీసీ బస్‌లలో ప్రయాణించే మహిళలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ భయం వద్దు!

ఈ ఏటీఎంలో వినియోగదారుల సౌకర్యార్థం పలు రకాల చెల్లింపు విధానాలను అందుబాటులో ఉంచారు. రూ.10 నుంచి రూ.60 వరకు నగదు రూపంలో చెల్లించి పాలు తీసుకోవచ్చు. అయితే, కచ్చితమైన చిల్లర మాత్రమే వేయాల్సి ఉంటుంది. అలాగే గూగుల్ పే, ఫోన్‌పే వంటి క్యూఆర్ కోడ్ (QR Code) ఆన్‌లైన్ పేమెంట్ సౌకర్యం కూడా ఉంది. రెగ్యులర్ కస్టమర్ల కోసం నెలవారీ రీఛార్జ్ చేసుకునే ప్రత్యేక స్మార్ట్ కార్డులను సైతం ప్రవేశపెట్టారు.

ఈ మిల్క్ ఏటీఎం సేవలకు ముఖ్యంగా రాత్రి వేళల్లో అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఉదయం కన్నా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య జనం ఎక్కువగా వస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఏటీఎం వీడియో వైరల్ కావడంతో మధురై వ్యాప్తంగా మరో 150 చోట్ల ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. త్వరలో నగరంలోని నాలుగు దిక్కులతో పాటు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద కూడా వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం లీటరు ఆవు పాలను రూ.60 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రారంభించిన తొలిరోజు 30 లీటర్లు, రెండో రోజు ఏకంగా 90 లీటర్ల పాలు అమ్ముడయ్యాయి. రోజుకు కనీసం 150 లీటర్లు అమ్ముడైతే కానీ నిర్వహణ ఖర్చులు వెళ్లవని, కేవలం లాభాపేక్షతో కాకుండా ప్రజలకు స్వచ్ఛమైన పాలు అందించాలనే ఈ ప్రాజెక్ట్ చేపట్టామని నిర్వాహకుడు తెలిపాడు. అర్ధరాత్రి వేళ కూడా నాణ్యమైన పాలు దొరకడంపై మధురై వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *