Nara Lokesh | బాధితులకు అండగా ఉంటాం | ACTPnews

Nara Lokesh  | బాధితులకు అండగా ఉంటాం



విశాఖ స్టీల్ ప్లాంట్ (RINL)లో జరిగిన ఘోర ద్రవ ఉక్కు పేలుడు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా, మరో ఆరుగురు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విశాఖ కేజీహెచ్ (KGH) ఆసుపత్రికి చేరుకున్న రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి వంగలపూడి అనిత, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ మరియు ఎంపీ శ్రీభరత్ బాధితుల కుటుంబాలను పరామర్శించారు. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రభుత్వం తరఫున జీవితకాలం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పర్మనెంట్, కాంట్రాక్ట్ తేడా లేకుండా మృతుల ఇళ్లల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించిన లోకేశ్ పర్యటన తాలూకు లైవ్ దృశ్యాలు ఇక్కడ చూడండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *