Last Updated:
నేపాల్ త్రిశూలి లోయలో విరుచుకుపడిన పెను వరదల నుంచి ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన అద్భుత సమయస్ఫూర్తితో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడారు. పిల్లలంతా బయటకు వచ్చిన క్షణాల్లోనే మూడు అంతస్తుల భవనం వరదలో కొట్టుకుపోయింది.
నేపాల్ త్రిశూలి లోయలో సంభవించిన హిమానీనద ఆకస్మిక వరద ప్రళయం పెను విధ్వంసం సృష్టించింది. తొమ్మిది మీటర్ల ఎత్తున విరుచుకుపడిన బురద, రాళ్లు, వరద నీరు గ్రామాలనే తుడిచిపెట్టేసింది. ఈ భయంకర విపత్తు సమయంలో త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్, ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు రాజేంద్ర దవాడి (47) చూపిన అసాధారణ సమయస్ఫూర్తి ఏకంగా 1,643 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడింది. ఉదయం 9:20 గంటల సమయంలో పాఠశాలలో మొదటి షిఫ్ట్ కోసం 900 మంది పిల్లలు ఉండగా, మరో 700 మంది నడుస్తూ, బస్సుల్లో వస్తున్నారు.














