Last Updated:
నేపాల్లోని భోటేకోషి నది వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. ఇప్పటివరకు 626 మృతదేహాలు లభ్యం కాగా, మరో 2,400 మంది గల్లంతయ్యారు. ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యల కోసం నేపాల్ ప్రభుత్వం అంతర్జాతీయ సమాజం సాయం కోరింది.
నేపాల్లో భోటేకోషి నది ఉగ్రరూపం దాల్చడంతో సంభవించిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, నదుల ఉప్పొంగుతో రసువా, నువాకోట్, దాదింగ్, చిత్వాన్ జిల్లాల్లో భారీ ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటివరకు వరద ప్రాంతాల నుంచి 626 మృతదేహాలను వెలికితీశారు. సుమారు 2,400 మందికి పైగా ఆచూకీ ఇంకా తెలియరాలేదు. రెస్క్యూ బృందాలు ప్రాణాలకు తెగించి ఇప్పటివరకు 4,450 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. కాపాడిన వారిలో దాదాపు 187 మంది విదేశీ పౌరులు ఉన్నారు.














