Last Updated:
Patna: బీహార్ రాజధాని పాట్నాలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నగరంలోని అగమ్కువాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇందుకు కారణమైంది. రోడ్డుపై వెళ్తున్న ఓ యువకుడ్ని అకస్మాత్తుగా ఓ బస్సు ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత భారీ గందరగోళం చెలరేగింది.
Patna: బీహార్ రాజధాని పాట్నాలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నగరంలోని అగమ్కువాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇందుకు కారణమైంది. రోడ్డుపై వెళ్తున్న ఓ యువకుడ్ని అకస్మాత్తుగా ఓ బస్సు ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత భారీ గందరగోళం చెలరేగింది. రోడ్డు యాక్సిడెంట్ ఘటనలో యువకుడు మృతి చెందడంతో ఆగ్రహించిన స్థానికులు బస్సుతో పాటు పోలీసుల వాహనాలను తగులబెట్టారు. న్యూస్ కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపై కూడా భౌతికదాడులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.














