Last Updated: Sep 04, 2026, 15:31 IST
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ పాపాల డొంకలన్నీ కూడా ఒకటొకటిగా కదులుతున్నాయని విమర్శించారు. స్పోర్ట్స్ కోటా నియామకాలు, మెరిట్ లిస్టులు, ఆన్లైన్ మార్కుల కేటాయింపుల్లో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ అక్రమాలకు పాల్పడ్డారని మండిపడుతూ, డీఎస్సీ నియామకాలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని, ప్రభుత్వం పూర్తి డేటాను బహిర్గతం చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.













