టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.. ట్యాబ్ లు పంపిణీకి ఏర్పాట్లు చేశారు అధికారులు.. ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫొటో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ.. వెంటనే క్షమాపణలు చెప్పి చంద్రబాబు ఫొటో ఏర్పాటు చేశారు పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్… అయితే, పాడా కార్యాలయానికి వచ్చి ఆందోళన చేశారు జనసేన నేతలు, ప్రతిసారి వర్మకి ఇది అలవాటుగా మారిందని ఘర్షణకి దిగారు.. దీంతో, టీడీపీ, జనసేన నేతల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది.. జనసేన నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో ఘర్షణకు దిగారు టీడీపీ కార్యకర్తలు.












