Last Updated:
ఉక్రెయిన్, పశ్చిమాసియా ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాలకు తక్షణమే ముగింపు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్తో సమావేశం అనంతరం ఆయన దౌత్యం, శాంతియుత చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని స్పష్టం చేశారు.
ప్రపంచాన్ని తీవ్రంగా బాధిస్తున్న ఉక్రెయిన్, ఇరాన్ సహా ఇతర దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధాలకు తక్షణమే ముగింపు పలకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్తో మోదీ అత్యంత కీలకమైన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఇరు దేశాల నేతలు సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం అయినా, పశ్చిమాసియాలో జరుగుతున్న సాయుధ పోరు అయినా వెంటనే ముగియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.














