Last Updated:
2014 తర్వాత భారతదేశ మౌలిక సదుపాయాల రంగం శరవేగంగా అభివృద్ధి చెందింది. రవాణా, సోలార్ విద్యుత్, డిఫెన్స్ ఎగుమతులు, స్టార్టప్లు, వైద్య రంగాల్లో మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన ప్రగతిని సాధించి ప్రపంచానికి మన దేశం ఆదర్శంగా నిలిచింది.
2014 తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అనేక మైలురాళ్లను దాటింది. దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపింది. ముఖ్యంగా ఆర్థికంగా, మౌలిక సదుపాయాల కల్పనలో మునుపెన్నడూ చూడని ఎన్నో అద్భుత విజయాలను సొంతం చేసుకుంది. దేశ ప్రగతికి మూలస్తంభాలైన రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టుల నిర్మాణంలో పదేళ్ల వ్యవధిలోనే రికార్డు సృష్టించింది. ఒకప్పుడు కేవలం కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టులన్నీ నేడు సాకారమయ్యాయి. రక్షణ రంగంలో దిగుమతుల స్థాయి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం.














