.మల్టీడైమెన్షనల్ పేదరికం నుంచి కోట్ల మంది భారతీయులు బయటపడ్డారనీ, గృహ నిర్మాణం, పారిశుధ్యం, ఆరోగ్యం, తాగునీరు, గ్రామీణ మౌలిక సదుపాయాలలో భారీ పెట్టుబడులు జరిగాయని చంద్రబాబు ప్రస్తావించారు. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్’ సూత్రం మోదీ పాలనకు మార్గదర్శకమని చెప్పారు. కరోనా పాండమిక్, సప్లై చైన్ షాక్స్, జియోపాలిటికల్ సంక్షోభాల మధ్య కూడా భారత్ వేగవంతమైన అభివృద్ధి చూపించిందని హైలైట్ చేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్, మనీకంట్రోల్ దీన్ని రిపోర్ట్ చేశాయి.













