Last Updated:
PM Modi JD Vance call: ఓవైపు భారత్కి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకుంటూ అమెరికా, మరోవైపు స్నేహ బంధం కొనసాగిస్తూ ఉంది. ఇది ఇండియాకి ఇబ్బందికరంగా మారుతోంది. అయినా ఇండియా.. జాగ్రత్తగా ఆలోచిస్తూ.. నిర్ణయాలు తీసుకుంటోంది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మధ్య ఒక అత్యంత కీలకమైన, వ్యూహాత్మక ఫోన్ సంభాషణ జరిగింది. మారుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితుల తరుణంలో ఈ చర్చలకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సంభాషణలో ప్రధానంగా, భారత్, అమెరికా దేశాల మధ్య ఉన్న ‘సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని’ వివిధ కీలక రంగాలలో మరింత లోతుగా, బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నేతలూ సుదీర్ఘంగా చర్చించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారిక ‘X’ ఖాతా ద్వారా తెలిపారు. టెక్నాలజీ, రక్షణ, వాణిజ్య రంగాల్లో రెండు దేశాలూ కలిసికట్టుగా అడుగులు వేయాల్సిన ఆవశ్యకతను వారు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.














