Last Updated:
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భారత్ ‘గోల్డెన్ ఫైబర్’ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ప్రపంచంలోనే తిరుగులేని అగ్రగామిగా అవతరించింది. రైతు సంక్షేమం, పారిశ్రామిక ఆధునీకరణను సమన్వయం చేస్తూ కేంద్రం అమలు చేసిన సంస్కరణలతో దేశంలో దాదాపు 40 లక్షల రైతు కుటుంబాలు, లక్షలాది మంది కార్మికుల జీవితాల్లో ఆర్థిక వెలుగులు నిండాయి.
ప్రపంచ మార్కెట్లో 75 శాతం ఉత్పత్తి వాటాను చేజిక్కించుకోవడంతో పాటు రూ.3,155 కోట్లకు పైగా విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ, భారత్ పర్యావరణహిత పారిశ్రామిక వృద్ధిలో ‘ఆత్మనిర్భర్’ శక్తిగా గ్లోబల్ లీడర్గా నిలిచింది. పర్యావరణ హితమైన సహజ నారగా గుర్తింపు పొందిన జనపనార (జూట్) ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశంలో దాదాపు 40 లక్షల రైతు కుటుంబాలకు, సుమారు 3.70 లక్షల మంది మిల్లు కార్మికులకు జీవనోపాధిని కల్పిస్తూ జూట్ రంగం పారిశ్రామికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న జనపనార వస్తువుల్లో భారత్ వాటా దాదాపు 75 శాతంగా ఉంది.














