గత కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని అవినీతి, అనిశ్చితి, బలహీనమైన నాయకత్వంతో వదిలేయగా.. ప్రధాని మోదీ భారతదేశానికి ఆత్మవిశ్వాసం, సుపరిపాలన, ప్రగతిశీలమైన సరికొత్త గుర్తింపును తెచ్చారు. ఈనాడు ప్రపంచం భారతదేశాన్ని కేవలం ఒక ప్రాంతీయ శక్తిగా మాత్రమే కాకుండా, 21వ శతాబ్దపు అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటిగా చూస్తోంది. కాంగ్రెస్ వంటి పార్టీలు రాజకీయాన్ని కేవలం తమ వారసత్వ రాజరికాన్ని కాపాడుకునే సాధనంగా చూస్తే, మోదీ రాజకీయాన్ని “కుటుంబం కంటే దేశమే మిన్న” (Nation Above Family) మరియు “అధికారం కంటే సేవకే ప్రాధాన్యం” (Service Above Power) అనే నినాదంతో ఒక పవిత్రమైన మిషన్గా మార్చారు.
2014లో ప్రధాని మోదీ దేశానికి మొదట ‘సామూహిక ఆలోచన’ని పరిచయం చేశారు. ఆ తర్వాత ప్రజల నమ్మకంతో దానిని ‘సామూహిక సంకల్పం’గా మార్చారు. నేడు ఆ సంకల్పమే ‘వికసిత్ భారత్ రూపంలో ఒక భారీ ‘సామూహిక కల’గా సాకారం అవుతోంది.
2014కు ముందు దేశం ప్రాథమిక వసతుల కొరతతో కొట్టుమిట్టాడేది. కానీ గత 12 ఏళ్లలో క్షేత్రస్థాయిలో వచ్చిన మార్పులు అసాధారణం
దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది.
దేశంలోని అన్ని గ్రామాలకు 100% విద్యుద్దీకరణ సాధించారు.
ఎక్స్ప్రెస్వేల (Expressways) నెట్వర్క్ గతంతో పోలిస్తే 7 రెట్లు పెరిగింది.
దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుండి ఏకంగా 165కి చేరింది.
ఈ కాలం వలసరాజ్యాల ఆలోచనల నుండి దేశానికి విముక్తి కలిగించి, నిజమైన సంస్కృతి పునరుజ్జీవనానికి నాంది పలికింది. చారిత్రాత్మక ప్రాంతాలను ‘లోక్ కల్యాణ్ మార్గ్’, ‘కర్తవ్య పథ్’, మరియు ‘సేవా తీర్థ్’లుగా మార్చడం మన సాంస్కృతిక వైభవానికి నిదర్శనం.
ఉపాధి సృష్టికర్తలుగా యువత.. ‘లక్షాధికారి దీదులు’గా మహిళలు
నేటి భారతీయ యువత కేవలం ‘ఉద్యోగాలు వెతుక్కునేవారిగా’ కాకుండా, ‘ఉద్యోగాలు ఇచ్చేవారిగా’ మారుతున్నారు. నేడు దేశంలో 2 లక్షలకు పైగా స్టార్టప్లు (Startups), 125కు పైగా యూనికార్న్లు (Unicorns) ఉన్నాయి. దీనితో భారతదేశం కేవలం ‘మ్యాన్ పవర్’ దేశంగానే కాకుండా ‘మ్యానుఫ్యాక్చరింగ్ పవర్’ (ఉత్పత్తి శక్తి)గా రూపాంతరం చెందుతోంది.
మరోవైపు, మహిళా సాధికారత కేవలం ‘మహిళల అభివృద్ధి’ అనే స్థాయి నుండి దాటి ‘మహిళల నేతృత్వంలోని అభివృద్ధి’ (Women-led Development) వైపు దూసుకుపోతోంది. దేశంలో 3 కోట్లకు పైగా మహిళలు ‘లఖ్ పతి దీదీలు’ (Lakhpati Didis) గా ఎదిగారు. అలాగే రక్షణ దళాలలో మహిళా అధికారుల సంఖ్య 4 రెట్లు పెరగడం నారీ శక్తి స్వావలంబనకు నిదర్శనం.
గత 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ హయాంలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరిక రేఖకు ఎగువకు వచ్చారు. 4 కోట్ల శాశ్వత గృహాల నిర్మాణం, 44 కోట్ల మందికి పైగా పౌరులకు ‘ఆయుష్మాన్ భారత్’ ఆరోగ్య రక్షణ కల్పించడం, మరియు ‘పీఎం ముద్ర యోజన’ కింద పూచీకత్తు లేని రూ.40 లక్షల కోట్ల రుణాలను అందించడం ఈ విజయానికి పునాదిగా నిలిచాయి.
‘జన్ ధన్-ఆధార్-మొబైల్’, యూపీఐ ద్వారా భారతదేశం డిజిటల్ లావాదేవీలలో ప్రపంచాన్ని శాసిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఏటా రూ.314 లక్షల కోట్ల డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే డిజిటల్ చెల్లింపుల్లో భారతదేశం ఒంటరిగానే 49% వాటాను కలిగి ఉండటం విశేషం.
ప్రధాని మోదీ హయాంలో సరిహద్దుల అభివృద్ధికి వ్యూహాత్మక ప్రాధాన్యత లభించింది. ఒకప్పుడు భారతదేశపు “చివరి గ్రామాలుగా” ఉపేక్షించబడిన సరిహద్దు గ్రామాలు, నేడు జాతీయ విధానంలో దేశపు “మొదటి గ్రామాలుగా” అగ్రస్థానాన్ని ఆక్రమించాయి.
సాంస్కృతికంగా, 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం, కాశీ విశ్వనాథ్ ధామ్ పునర్నిర్మాణం, మరియు మహాకాల్ మహాల్లోక్ వంటి ప్రాజెక్టులు మన సాంస్కృతిక జాతీయవాదం యొక్క సజీవ చైతన్యాన్ని మేల్కొల్పాయి.
నేడు భారతదేశం అంతర్గతంగా బలోపేతం కావడమే కాకుండా, అంతర్జాతీయ వేదికపై ఒక సూపర్ పవర్గా అవతరించింది. ప్రధాని మోదీకి ప్రపంచంలోని 32 దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలను అందించి గౌరవించాయి. ఇది కేవలం ఒక్క వ్యక్తికి దక్కిన గౌరవం కాదు, సనాతన భారతీయ ఆలోచనకు, 140 కోట్ల మంది భారతీయుల నిరంతర కృషికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపు.












