Last Updated:
PM Narendra Modi Independence Day Speech: వికసిత భారత్ స్వప్నానికి దేశ యువతే చోదక శక్తులని ప్రధాని తెలిపారు. స్టార్టప్లకు ఊతమిచ్చేందుకు రూ.లక్ష కోట్ల ఇన్నోవేషన్ ఫండ్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. టెక్నాలజీ యుగంలో యువతను సిద్ధం చేసేందుకు వచ్చే ఏడాది కాలంలో కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చారిత్రక ఎర్రకోట బురుజుల పైనుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ఉద్వేగభరితమైన, దిశానిర్దేశక ప్రసంగం చేశారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన ఆయన, భారత్ ఇకపై అగ్రరాజ్యాల సరసన నిలిచేందుకు ‘నెక్ట్స్ లెవెల్’ సంస్కరణలకు నాంది పలుకుతోందని స్పష్టం చేశారు. 140 కోట్ల భారతీయుల సంకల్ప బలంతో 2047 నాటికి దేశాన్ని పూర్తి స్థాయి ‘వికసిత భారత్’గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఉద్ఘాటించారు.














