Last Updated:
PM Narendra Modi: ఎవరైనా ఉచితంగా మనీ ఇస్తామని అంటే.. మనం వద్దు అని ఎందుకు అంటాం. మనీ అందరికీ అవసరమే. అందుకే కేంద్ర ప్రభుత్వం పంద్రాగస్టు సందర్భంగా రూ.5,000 చొప్పున ఇస్తోందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత పౌరులందరికీ రూ.5,000 చొప్పున నగదు ప్రోత్సాహకం అందిస్తున్నారనీ, దీనికోసం బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలని చెబుతూ.. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక ప్రకటన విస్తృతంగా వ్యాపించింది. ఈ ప్రకటనలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి భారతీయ పౌరుడికీ నగదు గ్రాంట్ ఇస్తున్నట్లు చెబుతూ, లింక్పై క్లిక్ చేసి వ్యక్తిగత, బ్యాంకు వివరాలు నమోదు చేయమని కోరుతున్నారు. అయితే ఇది పూర్తిగా నకిలీదని, మోసపూరిత ప్రచారమని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఖండించింది.














