Last Updated:
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వారాంతపు సెలవుల నేపథ్యంలో సర్వదర్శనానికి 20 నుంచి 24 గంటల వరకు సమయం పడుతోంది.
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వారాంతపు సెలవులు, వేసవి సెలవుల నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో పాటు క్యూ లైన్ ఔటర్ రింగ్ రోడ్డులోని ఆక్టోపస్ భవనం వరకు విస్తరించింది. ప్రస్తుతం సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు సుమారు 20 నుంచి 24 గంటల వరకు సమయం పడుతున్నట్లు సమాచారం.













