ముందే అనుకున్న సిగ్నల్.. పక్కా ప్లాన్ ప్రకారం లోయలోకి: ఈ హత్యలో ఎలాంటి ఆధారాలూ వదలకుండా పక్కా ప్లాన్ రచించారు. కేతన్ను హత్య చేయడానికి ముందుగానే సియా, చేతన్ ఇద్దరూ ఒక సిగ్నల్ (సంకేతం) కూడా సెట్ చేసుకున్నారు. ప్లాన్ ప్రకారం, ఏమీ ఎరుగని కేతన్తో కలిసి సియా నడుచుకుంటూ వెళ్లి, అనుకున్న ప్రదేశంలో ఆమె కింద కూర్చోగానే, వెనుక నక్కి ఉన్న చేతన్ చౌదరి వచ్చి కేతన్ను లోయలోకి తోసేయాలని నిర్ణయించుకున్నారు. జూన్ 18వ తేదీన మహారాష్ట్రలోని మావల్ తాలూకాలో ఉన్న లోహగడ్ కోట (Lohagad Fort) దగ్గరకు వెళ్లినప్పుడు, వారు అనుకున్న విధంగానే సియా కిందకు కూర్చోవడం, వెంటనే చేతన్ వచ్చి కేతన్ను 350 అడుగుల లోతైన లోయలోకి తోసేయడం క్షణాల్లో జరిగిపోయాయని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. “కేతన్కు అసలు ఏం జరుగుతుందో ఊహించే అవకాశం కూడా దొరకలేదు. అతనికి ఏమీ అర్థం కాకముందే లోయలోకి తోసేసినట్లైంది” అని పోలీసు వర్గాలు తెలిపాయి.













